వెనకకు భగవద్గీత ముందుకు

1 అర్జునవిషాద యోగము


||శ్రీమద్భగవద్గీత ||
||ఓం శ్రీ పరమాత్మనే నమః ||
||అథ శ్రీమద్భగవద్గీతా ||
అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః

27 వ శ్లోకం

శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్బన్ధూనవస్థితాన్ ||1-27|| .

ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి,

దశావతారములు

పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.

భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్

పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును (జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు).


పూర్ణావతారములు

పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:

  1. మత్స్యావతారము
  2. కూర్మావతారము
  3. వరాహావతారము
  4. నృసింహావతారము లేదా నరసింహావతారము
  5. వామనావతారము
  6. పరశురామావతారము
  7. రామావతారము
  8. కృష్ణావతారము
  9. బుద్దావతారము లేదా బలరామావతారము
  10. కల్క్యావతారము
  • బలరాముడు స్థానంలో బుద్దుని శంకరాచార్యులు తీసుకుని వచ్చినట్లు ఒక ప్రతీతి. కానీ వెంకటేశ్వరస్వామి ఈ దశావతారాలలోని వాడు కాదు.

© Copyright శ్రీ భగవధ్గీత